ETV Bharat / state

రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది

author img

By

Published : Jun 20, 2020, 8:15 AM IST

అన్నదాత ఆదాయం రెట్టింపు కావాలంటే ఏమేం చేయాలో రాష్ట్రానికి ఐసీఏఆర్​ పలు సిఫార్సులు చేసింది. 2022-23 నాటికి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలంది. పాల ఉత్పత్తి పెంచుతూ మేకల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని సూచించిది. గ్రామాల్లోని నిరుద్యోగులతో అగ్రి క్లినిక్​లు ఏర్పాటు చేయాలంది.

Only if we encourage farmers ... will increase income
రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది

రాష్ట్రంలో రైతు కుటుంబ ఆదాయం రెట్టింపు కావాలంటే పంటల సాగుతో పాటు పాడి, మత్స్య పరిశ్రమలు, అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌) స్పష్టం చేసింది. దేశంలో రైతులందరి ఆదాయం 2022-23 చివరికల్లా రెట్టింపు కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో సూచిస్తూ రాష్ట్రాల వారీగా ఐసీఏఆర్‌ సమగ్ర నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చేసిన సిఫార్సుల్లో ముఖ్యాంశాలు..

  • రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగు, దిగుబడుల పెంపు ద్వారా రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు అవకాశాలున్నాయి.
  • పంట ఉత్పాదకత పెరిగితే రైతుల ఆదాయంలో 33 శాతమే పెరుగుతుందని నీతిఆయోగ్‌ పేర్కొంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే మరో 33 శాతం, ఇతర మార్గాల ద్వారా ఇంకో 33 శాతం ఆదాయం పెంచడానికి అవకాశముంటుంది.
  • గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల నిరుద్యోగులతో అగ్రి క్లినిక్‌ల ఏర్పాటు చేయించాలి. వ్యవసాయ వాణిజ్య సముదాయాలను ప్రోత్సహించాలి.
  • వ్యవసాయాభివృద్ధికి వర్షాధార భూముల్లో వాననీటి సంరక్షణకు నీటి కుండీల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. రాయితీలిచ్చి వీటిని నిర్మించడానికి రూ.5 వేల కోట్లను బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించాలి.
  • ప్రభుత్వం పాడి పరిశ్రమకు రూ.1000 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.500 కోట్లు, గొర్రెలు, మేకల అభివృద్ధికి రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకోవాలి. ఆయా రంగాల వృద్ధికి ఖర్చు చేయాలి.
    icar-instructions-to-telangana-to-increase-farming
    రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది
  • పాల ఉత్పత్తి ఏటా 5 నుంచి 8 శాతం పెరగాలి. కోడిగుడ్లు 5-7, మాంసం ఉత్పత్తిని 8 నుంచి 15 శాతానికి పెంచాలి.
  • పంటల సాగు, పాడి, కోళ్లు, మత్స్య పరిశ్రమలకు రక్షణ కల్పిస్తే రైతుల ఆదాయం రెట్టింపవుతుంది.
  • కందులు, తృణధాన్యాలు, కుసుమలు వంటి పంటలు పండించే రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి వాటినుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయించి మార్కెట్లకు నేరుగా ఆ సంఘాలే అమ్ముకునేలా చేయాలి.
  • వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలతో పాటు రాష్ట్రంలోని ఇక్రిశాట్‌ వంటి వ్యవసాయ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తల సమన్వయంతో, నేలల స్వభావం, వాతావరణాన్ని బట్టి ‘పంటల కాలనీలు’ ఏర్పాటు చేయాలి.
  • రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నా సగటు ఉత్పాదకత తగ్గిపోతోంది. మామిడి దిగుబడులు పెంచడానికి అవకాశాలున్నాయి. ఏళ్లనాటి పాత తోటల నుంచి పూత, కాత సరిగా రావడం లేదు.
  • నాణ్యమైన విత్తనాలను ఇవ్వడానికి ‘విత్తన గ్రామం’ పధకం అమలు చేయాలి.
  • ఏయే రంగాల్లో ఎంత వార్షిక వృద్ధి రేటు ఉంటే రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ఐసీఏఆర్‌ సూచించింది. రాష్ట్రంలో 2015-20 మధ్య ఐదేళ్లలో రెండు సార్లు(2016-17, 2019-20) మాత్రమే నిర్ణీత 10.5 శాతం కన్నా ఎక్కువ వృద్ధి రేటు సాధ్యమైంది.
    icar-instructions-to-telangana-to-increase-farming
    రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది

రాష్ట్రంలో రైతు కుటుంబ ఆదాయం రెట్టింపు కావాలంటే పంటల సాగుతో పాటు పాడి, మత్స్య పరిశ్రమలు, అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌) స్పష్టం చేసింది. దేశంలో రైతులందరి ఆదాయం 2022-23 చివరికల్లా రెట్టింపు కావాలనే లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు ఏం చర్యలు తీసుకోవాలో సూచిస్తూ రాష్ట్రాల వారీగా ఐసీఏఆర్‌ సమగ్ర నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చేసిన సిఫార్సుల్లో ముఖ్యాంశాలు..

  • రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగు, దిగుబడుల పెంపు ద్వారా రైతు ఆదాయం రెట్టింపు చేసేందుకు అవకాశాలున్నాయి.
  • పంట ఉత్పాదకత పెరిగితే రైతుల ఆదాయంలో 33 శాతమే పెరుగుతుందని నీతిఆయోగ్‌ పేర్కొంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే మరో 33 శాతం, ఇతర మార్గాల ద్వారా ఇంకో 33 శాతం ఆదాయం పెంచడానికి అవకాశముంటుంది.
  • గ్రామాల్లో వ్యవసాయ కుటుంబాల నిరుద్యోగులతో అగ్రి క్లినిక్‌ల ఏర్పాటు చేయించాలి. వ్యవసాయ వాణిజ్య సముదాయాలను ప్రోత్సహించాలి.
  • వ్యవసాయాభివృద్ధికి వర్షాధార భూముల్లో వాననీటి సంరక్షణకు నీటి కుండీల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. రాయితీలిచ్చి వీటిని నిర్మించడానికి రూ.5 వేల కోట్లను బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఇప్పించాలి.
  • ప్రభుత్వం పాడి పరిశ్రమకు రూ.1000 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.500 కోట్లు, గొర్రెలు, మేకల అభివృద్ధికి రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకోవాలి. ఆయా రంగాల వృద్ధికి ఖర్చు చేయాలి.
    icar-instructions-to-telangana-to-increase-farming
    రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది
  • పాల ఉత్పత్తి ఏటా 5 నుంచి 8 శాతం పెరగాలి. కోడిగుడ్లు 5-7, మాంసం ఉత్పత్తిని 8 నుంచి 15 శాతానికి పెంచాలి.
  • పంటల సాగు, పాడి, కోళ్లు, మత్స్య పరిశ్రమలకు రక్షణ కల్పిస్తే రైతుల ఆదాయం రెట్టింపవుతుంది.
  • కందులు, తృణధాన్యాలు, కుసుమలు వంటి పంటలు పండించే రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి వాటినుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయించి మార్కెట్లకు నేరుగా ఆ సంఘాలే అమ్ముకునేలా చేయాలి.
  • వ్యవసాయ, ఉద్యాన వర్సిటీలతో పాటు రాష్ట్రంలోని ఇక్రిశాట్‌ వంటి వ్యవసాయ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తల సమన్వయంతో, నేలల స్వభావం, వాతావరణాన్ని బట్టి ‘పంటల కాలనీలు’ ఏర్పాటు చేయాలి.
  • రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతున్నా సగటు ఉత్పాదకత తగ్గిపోతోంది. మామిడి దిగుబడులు పెంచడానికి అవకాశాలున్నాయి. ఏళ్లనాటి పాత తోటల నుంచి పూత, కాత సరిగా రావడం లేదు.
  • నాణ్యమైన విత్తనాలను ఇవ్వడానికి ‘విత్తన గ్రామం’ పధకం అమలు చేయాలి.
  • ఏయే రంగాల్లో ఎంత వార్షిక వృద్ధి రేటు ఉంటే రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ఐసీఏఆర్‌ సూచించింది. రాష్ట్రంలో 2015-20 మధ్య ఐదేళ్లలో రెండు సార్లు(2016-17, 2019-20) మాత్రమే నిర్ణీత 10.5 శాతం కన్నా ఎక్కువ వృద్ధి రేటు సాధ్యమైంది.
    icar-instructions-to-telangana-to-increase-farming
    రైతులను ప్రోత్సహిస్తేనే... ఆదాయం పెరుగుతుంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.